Trinethram News : హైదరాబాద్: షిర్డీ సాయిబాబా భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్-నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 3నుంచి 25వరకు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్- నాగర్సోల్ రైలు (07007) రైలు జులై 3వ తేదీ నుంచి ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది.నాగర్సోల్ -సికింద్రాబాద్ (07002) రైలు ప్రతి శుక్రవారం ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


