WhatsApp Image 2024 03 12 at 15.42.13
Trinethram News : సోషల్ మీడియాలో పరిస్థితులు మరీ దారుణంగా మారుతున్నాయి. ఏ మాట అంటే ఎవరు ట్రోల్ చేస్తారో? ఏ అభిప్రాయం పంచుకుంటే ఎలాంటి తంటాలొస్తాయో అని వణికిపోయేలా చేస్తున్నారు. కొంత మంది వాళ్ళ ఒక తల్లి తన ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు కూతుళ్లను వదిలేసి అర్ధాంతరంగా తనువు చాలించింది. అలా చేసేలా ఆమెను ఉసిగొలుపుతూ.. నెట్టింట నానా హింసలకు గురి చేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి సీఎం జగన్ అండగా నిలిచారు. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి, ఆ ఇద్దరు చిన్నారులకు అండగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.
