TRINETHRAM NEWS

Trinethram News : లింగావిర్భవ దినోత్సవమును మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారని, మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం అని పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ గారు శివరాత్రి వేడుకలను ప్రారంభిస్తూ తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు శివలింగం, ఓం,మరియు త్రిశూల రూపంలో కూర్చొని విన్నుత ప్రదర్శన చేసి పలువురి ప్రశంసలు పొందారు. పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ అప్పారావు గారు,వైస్ ప్రిన్సిపల్ సోమా నాయక్ గారు, ఇన్చార్జులు ఝాన్సీ, రామ్మూర్తి ఉపాధ్యాయులు రమేష్, వెంకటేశ్వర్లు,రేణుక, జయ, పావని, ఆశలత, నవ్య ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.