తేజ పాఠశాలలో శివలింగాకార ప్రదర్శన

TRINETHRAM NEWS

Trinethram News : లింగావిర్భవ దినోత్సవమును మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారని, మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం అని పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ గారు శివరాత్రి వేడుకలను ప్రారంభిస్తూ తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు శివలింగం, ఓం,మరియు త్రిశూల రూపంలో కూర్చొని విన్నుత ప్రదర్శన చేసి పలువురి ప్రశంసలు పొందారు. పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ అప్పారావు గారు,వైస్ ప్రిన్సిపల్ సోమా నాయక్ గారు, ఇన్చార్జులు ఝాన్సీ, రామ్మూర్తి ఉపాధ్యాయులు రమేష్, వెంకటేశ్వర్లు,రేణుక, జయ, పావని, ఆశలత, నవ్య ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top