కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా: డిసెంబర్16
కరీంనగర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

జిల్లాలోని శంకరపట్నం మండలంలోని తాడికల్లు సమీపంలో శని వారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్ప్రత్రికి తరలించారు.

అనంతరం ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయను న్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్స ఉంది.

You cannot copy content of this page

Scroll to Top