WhatsApp Image 2024 01 04 at 12.26.39 PM
మకర జ్యోతి దర్శనంపై శబరిమల ట్రస్ట్ కీలక నిర్ణయం
ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది.
శబరిమలకు భక్తులు పోటెత్తుతున్న తరుణంలో ట్రావెన్కోర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నది. మకర జ్యోతి దర్శనం కోసం రోజుకి 50 వేల మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని చెప్పారు.మహిళలు,పిల్లలు రావద్దని అప్రమత్తం చేశారు.
జనవరి 10 తేదీనుంచి స్పాట్ టికెట్ బుకింగ్ రద్దు చేస్తున్నట్లు, జనవరి 14న 40 వేల మందికి, జనవరి 15న 50 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చామని ట్రావెన్ కోర్ బోర్డ్ తెలిపింది.
