డిండి. (గుండ్ల పల్లి) జూన్ 6,త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు జూన్ 3 నుండి 16 వరకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా నల్లగొండ జిల్లా డిండి మండలంలో మూడవరోజు శుక్రవారం టీ గౌరారం గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించినట్లు తాసిల్దార్ అంబటి ఆంజనేయులు తెలిపారు .మూడవరోజు నాటికి 542 దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. మండలంలో రెండు బృందా లుగా రెవెన్యూ అధికారులుగ్రామాలలో సదస్సులు నిర్వహిస్తున్నామని మొదటి టీంకు తాసిల్దార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో, రెండవ టీము డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సరోజ ఆధ్వర్యంలో సదస్సులు కొనసాగుతున్నాయని తాసిల్దార్ తెలిపారు.
రైతులకు సంబంధించిన భూమి వివరములు, సర్వే నెంబర్లు తప్పుగా , పాసుబుక్కులలో పేరు తప్పుగా ప్రచురితమైన, భూమి ఎక్స్టెండ్ లో తేడాలున్నా, పట్టాదారు పాసుబుక్కులో కులము, గ్రామము, ఇంటిపేరు కుటుంబ సభ్యుల పేర్లు తప్పుగా ఉన్నట్లయితే, తదితర సమస్యలపై గ్రామ సభలలో విన్నవించుకోవాలని, అప్లికేషన్లు గ్రామ సభలో అందిస్తామని వాటికి ఆధార్ కార్డు జత చేసి అందించాలని, ఈ సదవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని, డిండి తాసిల్దార్ ఆంజనేయులు రైతులకు పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


