WhatsApp Image 2024 03 06 at 07.48.43
Trinethram News : హైదరాబాద్:మార్చి 06
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు సమ్మతించింది.
ఈ మేరకు రుణం పొందేం దుకు స్టేట్ హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ఇందులో భాగంగా 95,235 ఇందిరమ్మ ఇళ్లకు గాను హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని సాంక్షన్ చేయనుంది.
గ్రామాల్లో 57,141 ఇళ్లు పట్టణాల్లో 38,094 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు ఆ రుణాలను స్టేట్ హౌజింగ్ బోర్డు వినియోగ నించనుంది.
