WhatsApp Image 2024 08 02 at 12.22.49
Trinethram News : గన్నవరం : 2nd Aug 2024
గన్నవరం మాజీ ఎంపీ వల్లభనేని వంశీ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అతడిని ఏ1గా నిందితుడిగా చేర్చారు.
ప్రస్తుతం వంశీ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.
అతడిని అరెస్టు చేసేందుకు ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు బయలుదేరినట్లు సమాచారం.
మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
