త్రినేత్రం న్యూస్,పెనుమూరు. ఫిబ్రవరి 11: పెనుమూరు మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) ఎం.శ్రీనివాసులు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. కార్యాలయంలో జరుగుతున్న పరిపాలనా విధానాలు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ రికార్డుల నిర్వహణ, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ, పెండింగ్ ఫైళ్ల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలం పరిధిలో ఉన్న కొన్ని భూ సమస్యలను టిడిపి మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పట్టాదారు పాసుపుస్తకాల జారీ, ఆన్లైన్ ఆదాయ–వసతి ధృవపత్రాల ఆలస్యం, భూ వివాదాల పరిష్కారంపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు.
ఆర్డీఓ స్పందిస్తూ, ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ శాఖ అధికారులు ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో తలారి రెడ్డెప్ప, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


