మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య.
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 23 : కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని రాందేవ్ రావు ఆసుపత్రి సీఈఓ డాక్టర్.యోబు జన్మదిన వేడుకలు హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్స్,అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది,కూకట్పల్లి జర్నలిస్టుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి,హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్.యోబు మాట్లాడుతూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


