ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయంపై ప్రధానితో చర్చలు
రామ్ చరణ్, అనిల్ కామినేని ప్రయత్నాలను ప్రశంసించిన మోదీ
విలువిద్యను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్న చరణ్
భారతీయ ప్రతిభకు ఏపీఎల్ సరైన వేదిక అవుతుందని ధీమా
ప్రధానికి బాలాజీ విగ్రహాన్ని బహూకరించిన రామ్ చరణ్ దంపతులు
Trinethram News : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అర్ధాంగి ఉపాసన కొణిదెల, మామగారు అనిల్ కామినేనితో కలిసి నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కావడం తెలిసిందే. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొఫెషనల్ ఆర్చరీ (విలువిద్య) లీగ్ అయిన ‘ఆర్చరీ ప్రీమియర్ లీగ్’ (ఏపీఎల్) తొలి ఎడిషన్ విజయవంతం కావడంపై వారు ప్రధానితో చర్చించారు.
దీనిపై ప్రధాని మోదీ నేడు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “రామ్ చరణ్, ఉపాసన, అనిల్ కామినేని గారితో సమావేశం కావడం సంతోషంగా ఉంది. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న సమష్టి కృషి ప్రశంసనీయం. మీ ప్రయత్నాల వల్ల అసంఖ్యాక యువతకు మేలు జరుగుతుంది” అని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ సమావేశంపై రామ్ చరణ్ కూడా స్పందిస్తూ, ప్రధానిని కలవడం గౌరవంగా ఉందని తెలిపారు. “భారతీయ సంస్కృతిలో విలువిద్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ లీగ్ ద్వారా మన క్రీడాకారుల ప్రతిభను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లాలన్నదే మా ఆకాంక్ష. దేశంలో అపారమైన ప్రతిభ ఉంది, ఏపీఎల్ వారికి సరైన వేదికను అందిస్తుంది” అని ఆయన అన్నారు. విలువిద్య వారసత్వాన్ని కాపాడటంలో ఇది తమ వంతు చిన్న ప్రయత్నమని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఏపీఎల్ ఛైర్మన్గా ఉన్న అనిల్ కామినేని నేతృత్వంలో ఈ లీగ్ను ప్రారంభించారు. ఔత్సాహిక క్రీడాకారులకు వృత్తిపరమైన శిక్షణ, అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


