వాఖండే స్టేడియంలో ముంబైని చిత్తుగా ఓడించిన రాజస్థాన్

TRINETHRAM NEWS

Trinethram News : ముంబై :ఏప్రిల్ 02
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ వరుస విజయాలతో జోరు కనిపిస్తోంది. నిన్న ముంబై తో జరిగిన మ్యాచ్‌లో రాజ స్థాన్ విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడే స్టేడియం లో జరిగిన మ్యాచ్‌లో ముం బైని చిత్తుగా ఓడించింది… పాయింట్స్ టేబుల్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్125 తక్కువ పరుగులకే పరిమి తం చేసిన రాజస్థాన్…ఛేద నలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీతో మరోసారి మెరిశాడు. దీంతో నిర్ధిష్ట లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేధించిన రాజస్థాన్.. ముంబైపై విజయం సాధించింది.

అయితే రాజస్థాన్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు నిల కడగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకె ళ్లారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10), జోస్ బట్లర్ (13), శాంసన్ (12) పేలవ ఫామ్‌తో నిరాశపరిచారు.

రియాన్ పరాగ్ 54 నాటౌట్ తో ఆకట్టుకున్నాడు. రవిచం ద్రన్ అశ్విన్ (16) ర్యాన్ పరాగ్ కు మద్దతుగా నిలిచి పరుగులు సాధించాడు. ఇక ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వల్ మూడు వికెట్లు తీయగా.. క్వేనా మఫాకా ఒక్క వికెట్ దక్కించుకుంది..

You cannot copy content of this page

Scroll to Top