Trinethram News : అధికారుల గ్రూపులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై అభ్యంతరకర కార్టూన్ పోస్ట్ చేశాడని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.. రాజన్న సిరిసిల్ల జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఇటీవల అధికారుల వాట్సాప్ గ్రూపులో “డియర్ విప్ ఆది శ్రీనివాస్ గారు.. సీఎం నా పనితనాన్ని గుర్తించాడు.. నేను ఇక్కడే ఉండి అక్రమార్కుల భరతం పడతా.. పైరవీలు నన్ను తొలగించలేవు” అంటూ కార్టూన్ పోస్ట్ చేసిన డీపీఆర్వో శ్రీధర్
ఈ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, ప్రభుత్వ పెద్దలు, ఆది శ్రీనివాస్ అనుచరులు.. దీంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్న కారణంతో డీపీఆర్వో శ్రీధర్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


