ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (QMRSMA) నూతన కమిటీ

TRINETHRAM NEWS

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(QMRSMA) నూతన కార్యవర్గ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శివయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మేడ్చల్ జిల్లా కో ఆప్షన్ సభ్యులు వరప్రసాద్, నూతన అధ్యక్షులు చింతల మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రవి కుమార్, కోశాధికారి సీహెచ్ గోవర్ధన్ రెడ్డి, సభ్యులు నందారెడ్డి, రాజులు, ఆర్ఎన్ చారీ, శ్యామల్ రావు, రాజేష్, లోకనాధం, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top