భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయమేది?: పురందేశ్వరి

TRINETHRAM NEWS

Purandeswari: భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయమేది?: పురందేశ్వరి..

మన్యం: టిడ్కో గృహాల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశిల వద్ద టిడ్కో గృహాలను ఆమె పరిశీలించారు..

జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇళ్లు అందలేదని విమర్శించారు. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ హడావుడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ప్రజలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం జరగలేదని.. ల్యాండ్‌, శాండ్‌, మద్యం పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని పురందేశ్వరి ఆరోపించారు..

You cannot copy content of this page

Scroll to Top