జూలై 23, 2026
TRINETHRAM NEWS
Pulse Polio Program

Pulse Polio : కూకట్పల్లి జూన్ 28 (త్రినేత్రం న్యూస్) : 415 మంది చిన్నారులకు పోలియో చుక్కలు – కాలనీ అధ్యక్షులు మహేందర్ నాయక్ ప్రశంసలు. దీనబంధు కాలనీలో ఈరోజు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో మొత్తం 415 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా మరోసారి చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కాలనీ ప్రజలు తమ బాధ్యతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమాన్ని టీమ్ లీడర్ ఎం. కరుణ సమర్థవంతంగా ముందుండి నిర్వహించగా, సి.హెచ్. సబిత, బి. రాజేశ్వరి, సుశీలమ్మలు ఎంతో నిబద్ధతతో పనిచేసి ప్రతి అర్హత కలిగిన చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కృషి చేశారు.ఈ సందర్భంగా దీనబంధు కాలనీ అధ్యక్షులు మహేందర్ నాయక్ మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు మరియు తమ పిల్లలను తీసుకువచ్చిన తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

“పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు.415 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం కాలనీవాసుల అవగాహనకు, ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇలాంటి ప్రజారోగ్య కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
“ప్రతి చిన్నారి ఆరోగ్యమే దేశ భవిష్యత్తు – ప్రతి పోలియో చుక్క ఒక సురక్షిత జీవితానికి భరోసా” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page