త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 19 :నెల్లూరు జిల్లా: బోగోలు మండలం… కౌరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పల్స్ పోలియో ప్రోగ్రాం… 21-12-2025 న ఆదివారం పల్స్ పోలియో ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రాథమిక… ఆరోగ్య కేంద్రం కోవూరు పల్లి నందు పల్స్ పోలియో ప్రోగ్రామ్ కి సంబంధించిన శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 21-12-2025 న బూత్ ల వారీగా మరియు 22, 23 తేదీలలో ,హౌస్ టు హౌస్ , ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది.
5 సంవత్సరాల లోపు పిల్లలు అందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో కావలి డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బ్రిజిత , ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కోవూరు పల్లి వైద్యులు మరియు వైద్య సిబ్బంది, ఐ .డి .డి .ఎస్, సూపర్వైజర్స్, మరియు సిబ్బంది హాజరు కావడం జరిగింది.ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు ప్రజలు సహకరించి పల్స్ పోలియో ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని కోరడమైనది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


