తేదీ : 26/10/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జగ్గంపేట నియోజకవర్గం, గండేపల్లి మండలం, నీలాద్రి రావు పేట గ్రామానికి చెందిన ఒక వివాహితురాలు అయినటువంటి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వయసుగల ఒక మహిళ మిస్సింగ్ కావడం జరిగింది. దానిపై గండేపల్లి పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. డీఎస్పీ పెద్దాపురం మరియు జగ్గంపేట సర్కిల్ ఎస్సై వై ఆర్ కె శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం మండల ఎస్సై శివ నాగబాబు ప్రత్యేక టీమును ఏర్పాటు చేశారు. ఆ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఉన్నట్టు తెలుసుకొని గోప్యంగా అనుసరించి ,ఆమెను గుర్తించి అధినం లోకి తీసుకోవడం జరిగింది. ఆ గ్రామం నుండి గండేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఆమె తల్లి , భర్తకు అప్పగించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


