తేదీ : 26/10/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); పురుషోత్తం పురం కంఫర్ట్ హోమ్స్ లో ఉన్న విజయ గణపతి స్వామి ఆధ్యాత్మిక ప్రాంగణంలో, మెహర్ ఆధ్వర్యంలో వసందైన గీతాలాపనలు, గాయిని, గాయకులు శ్రీ ప్రియ, పావని, రమణి, మెహర్, రాజ్ కుమార్, చంద్ర అద్భుతంగా ఆలపించారు. సమాచార వాయిద్య కారులు చక్కని సంగీతం అందించారు.
ఈ కార్యక్రమంలో కంపార్ట్ హోమ్స్ కమిటీ ప్రతినిధులు శ్రీనివాస శర్మ .ప్రసాద్, నరసింహారావు, సహకార కమిటీ మిత్రులు ఆ బృందానికి అభినందనలతో ఆత్మీయ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. సమాజ సేవకుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ నెంబర్ పంపాన. ఆనందరావు కళాభిమానంతో సన్మానం చేసి వాళ్ల సంగీత బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత ఆనందభరితంగా తెలుగు , హిందీ , సాహిత్యపరమైన పాటలకు సంగీత ప్రియులు తమ కరతాళ ధ్వనులతో ఆనందం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


