దేవరకొండ డివిజన్ మార్చ్ 11, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని సింగరాజు పల్లి, కోదండాపురం గ్రామాలలో 20లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంఖు స్థాపన చేసారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


