గోదావరిఖని మార్చి-12//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో , 5 ఇన్ క్లైన్, గోదావరిఖని లో అక్రమంగా తరలిస్తున్న 79.50 క్వింటాలు (160 బస్తాలు) 3,08,100 విలువ గల పిడిఎస్ బియ్యాన్ని డీసీఎం వంట తో సహా , సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ జి. రవీందర్ వాహనాన్ని పట్టుకొని , అక్రమంగా ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించి, ప్రజలను మరియు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న రాచర్ల రమేష్, దేశెట్టి మారుతి, ఎల్లంకి వీరన్, ఓదెల మహేందర్ లపై ఫిర్యాదు ఇవ్వగా, కేసు నమోదు చేసి విచారించడం జరుగుతుంది. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు ఎవరు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


