డిండి (గుండ్ల పల్లి)అక్టోబర్ 10 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని చెరుకుపల్లి గ్రామం శివారులో ఉదయం 06.00 గంటల సమయంలో డిండి పోలీస్ వారు పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా ఎదురుగా ఒక అశోక్ లీలాండ్ వాహనము టీ ఎస్ 05యు ఈ 6275 నెంబర్ కలది అనుమానాస్పదంగా వస్తుండటంతో గమనించి పోలీసులు దానిని ఆపి తనిఖీ చేయగా అందులో ఏడు బస్తాలలో పిడిఎస్ రైస్ బియ్యం తో నింపబడి అక్రమంగా (2.5) క్వింటాల్ తరలిస్తుండగా అట్టి డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని స్థానిక డిండిఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.
అక్రమంగా ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని రవాణా చేసిన నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


