తేదీ : 15/03/2025. కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లి కి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అడపా. దుర్గాప్రసాద్ పిఠాపురం చిత్రాడలో జరిగినటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవానికి వెళ్లి. సభ ముగిసిన తర్వాత ఇంటికి వెళుతుండగా మృతి చెందాడు. ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఈ విషయం ఆయనకు తెలిసిన వెంటనే చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


