WhatsApp Image 2024 01 12 at 6.04.09 PM
తిరుమల:
తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం … అదుపులో ఇద్దరు భక్తులు
తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది.
ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు.
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లోని మోకాళ్ల పర్వతం వద్ద వారి వ్యక్తిగత డ్రోన్ తో చిత్రీకరిస్తుండగా ఆ దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
