
OG 2 : త్రినేత్రం న్యూస్ : Jun 12, 2026, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన పవన్ కల్యాణ్ చిత్రం ‘ఓజీ‘కి సీక్వెల్ రానుంది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అభిమానులను ఆకట్టుకుంది. ‘ఓజీ 2’ ఉంటుందని దర్శకుడు సుజీత్, హీరో పవన్ కల్యాణ్ గతంలోనే వెల్లడించారు. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో సీక్వెల్ పై అనుమానాలు నెలకొన్నాయి.
అయితే, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తాజాగా ‘ఓజీ 2’ పై అప్డేట్ ఇచ్చింది. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత చర్చలు మొదలవుతాయని, ఇచ్చిన మాట ప్రకారమే పవన్ చేస్తారని తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe