జూలై 7, 2026

WhatsApp Image 2023 12 11 at 4.26.37 PM

TRINETHRAM NEWS

ప్రభుత్వాలు మారినా ఆగని కబ్జాలు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

గత ప్రభుత్వ హయాంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, అధికారంలోకి వస్తే కబ్జాలను అరికట్టి,కబ్జాదారుల పై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ,ప్రభుత్వం వచ్చినప్పటికీ కబ్జాదారులు అవేమి పట్టించుకోకుండా పట్టపగలు కబ్జాలు చెయ్యడం ఘోరమని అన్నారు. అధికారులకు కబ్జాల గురించి తెలిసీ కూడా ఉదాసీనత వ్యవహరీంచడం వల్ల పేద ప్రజలను కబ్జాదారులు లక్షల్లో మొసంచేస్తున్నారని ఇప్పటికైనా వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్ మండలం లో జగతగిరిగుట్ట 348/1, గాజులరామరంలో 342,326,307,306,లలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఈ విషయంపై రేపు కలెక్టర్ గారిని కలిసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతామని, లేకపోతే ప్రజాదర్బార్ లో సీఎం కు వినతిపత్రం ఇస్తామని హెచ్చరించారు.

You cannot copy content of this page