Subhash Chandra Bose’s Jayanti : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు.

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 23 త్రినేత్రం న్యూస్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొండమల్లేపల్లి శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కొండమల్లేపల్లి నగర కార్యదర్శి పర్వతం దినేష్ మాట్లాడుతూ…

నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లుగా నాకు రక్తం ఇవ్వండి…మీకు స్వాతంత్ర్యం ఇస్తాను..అనే మాటలు కేవలం నినాదాలు కాదు అవి త్యాగానికి,దేశభక్తికి ప్రతీక అని వారన్నారు.నేటి భారత యువత వారిని ఆదర్శంగా తీసుకొని. జాతీయ పునర్నిర్మానంలో భాగ్యస్వామ్యం కావాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో నగర గర్ల్స్ కన్వీనర్ సుస్మిత నగర సంయుక్త కార్యదర్శి కుమార్, హేమంత్,చరణ్,చిరు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Netaji Subhash Chandra Bose's birth anniversary celebrations

You cannot copy content of this page

Scroll to Top