National Constitution Day : జాతీయ రాజ్యాంగ దినోత్సవం – నవంబర్ 26

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ఈరోజు నవంబర్ 26ను దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో, భారత రాజ్యాంగ నిర్మాతలకు మా వినమ్ర నివాళిని అర్పిస్తున్నాం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ సభ సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధులందరికీ ఈ రోజు ప్రత్యేకంగా స్మరణీయమైనది.

భారత రాజ్యాంగం ప్రపంచంలోని అత్యంత సమగ్ర, ప్రజాహిత, సమానత్వాన్ని ప్రతిష్టించిన పత్రంగా నిలిచింది. ఇది మనకు స్వేచ్ఛ, సమానత్వం, సాంఘిక న్యాయం, మత, వర్గ, జాతి భేదాలు లేకుండా జీవించే హక్కులను ప్రసాదించింది.

ఈ సందర్భంగా మనం ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, దాని విలువలను రోజువారీ జీవితంలో పాటించడం అనే బాధ్యతను మరోసారి గుర్తుచేసుకోవాలి. మన దేశ ప్రగతి, ప్రజాస్వామ్య బలోపేతం రాజ్యంగ బద్ధతతోనే సాధ్యం. ప్రతి వ్యక్తి హక్కులను గౌరవించడం, ప్రతీ పౌరుడు తన బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మాత్రమే మన రాజ్యాంగ స్వప్నాలను సాకారం చేయగలం.

జై భారత్ – రాజ్యాంగమే మా శక్తి!ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మాజీ జిల్లా అధ్యక్షులు. ఉపాధ్యక్షులు గదిగే శివరాజ్.. జిల్లా జనరల్ సెక్రెటరీ మాధవి . సీనియర్ నాయకులు గొడుగు సుధాకర్ ఆచారి డి ఎస్ సి ఆర్ డబ్ల్యు బోర్డు మెంబర్. టి మోహన్ రెడ్డి మీడియా కన్వీనర్. టి రాఘవేందర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Constitution Day – November 26

You cannot copy content of this page

Scroll to Top