లారీ ఢీకొని తల్లీ, బిడ్డ మృతి

TRINETHRAM NEWS

Mother and child killed in lorry collision

Trinethram News : Jul 15, 2024,

తిరుపతి జిల్లా ఏర్పేడు-వెంకటగిరి రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని తల్లీ, బిడ్డ మృతి చెందారు. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన శారద (22), కుమార్తె గురువైష్ణవి (2), కుమారుడు గురుకార్తీక్ (4) రామానుజపల్లి క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగారు. భర్తను రమ్మని ఫోన్ చేసి శారద పిల్లలతో కలిసి రోడ్డు పక్కనే కూర్చుంది. ఈ క్రమంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న లారీ అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గురువైష్ణవి, శారద మృతి చెందగా.. గురుకార్తీక్‌ గాయపడ్డాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mother and child killed in lorry collision

You cannot copy content of this page

Scroll to Top