
MLA Raj Thakur : త్రినేత్రం న్యూస్ : పెద్దపల్లి: జిల్లా పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు, పంట మార్పిడి, రైతుల సంక్షేమం ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై శనివారం పెద్దపల్లి కలెక్టరేట్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్) హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ విప్ సీహెచ్ విజయ రమణ రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe