తేదీ : 18/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్) : ఇంచార్జ్; జి. వెంకన్న బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ఏడు మండలాల అధ్యక్షులతో అత్యవసర సమావేశం ఎమ్మెల్యే నిర్వహించారు. ఈనెల ఇరవై రెండు ,ఇరవై మూడు తేదీలలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పర్యటన దృష్ట్యా విజయవంతం చేయాలని దిశ నిర్దేశం చేయడం జరిగింది.
పోలవరం నిర్వాసితుల యోగక్షేమాలు, వాళ్లతో ముఖాముఖి అవ్వడానికి, అదేవిధంగా బహుళార్థ సాధక ప్రాజెక్టు కు వారి భూములు ఇచ్చే ఉద్దేశ్యము మొత్తం గౌరవించదగ్గ ప్రాజెక్టు కొరకు త్యాగం చేసినటువంటి నిర్వాసితుల స్థితిగతులు తెలుసుకోవడం కోసం, ఈ పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


