Missing Musharraf : గల్లంతైన ముషారఫ్ మృతదేహం లభ్యం!

TRINETHRAM NEWS

Missing Musharraf’s body found

Trinethram News : Andhra Pradesh : కృష్ణాజిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్ద ఈనెల 18 వ తేదీన సముద్రంలో గల్లంతయిన గుడివాడకు చెందిన యువకుడు అబ్దుల్ ముషారఫ్(21) మృతదేహం ఎట్టకేలకు లభ్యమయింది.

గత ఆరు రోజులుగా మృతదేహం కోసం ప్రత్యేక బోట్లలో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం రాత్రి బందరు మండలం కే పి టి పాలెం వద్ద ముషారఫ్ మృతదేహం కనిపించినట్లు కోడూరు ఎస్సై పి శిరీష తెలిపారు.

మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం చేసి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Missing Musharraf's body found

You cannot copy content of this page

Scroll to Top