నారా లోకేష్ కి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

TRINETHRAM NEWS

ఆప్యాయంగా అన్న బాగున్నావని పలకరించిన లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువ నాయకులు నారా లోకేష్ ఉత్తరాంధ్రలో శంఖారావం కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్దకు విచ్చేసిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు (ఎంజీఆర్) ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ అన్నా బాగున్నావా అని ఆప్యాయంగా ఎంజీఆర్ ని పలకరించారు.

అనంతరం పాతపట్నంలో ఈ 13వ తేదీన జరగబోయే శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు..

You cannot copy content of this page

Scroll to Top