మెగా పేరెంట్స్ సమావేశాన్ని పండుగలా నిర్వహించాలి

TRINETHRAM NEWS

మెగా పేరెంట్స్ సమావేశాన్ని పండుగలా నిర్వహించాలి
Trinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం.
కంభం: డిసెంబర్ 7న నిర్వహించనున్న మెగా పేరెంట్, టీచర్ సమావేశాన్ని పండుగ వాతావరణంలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన.శశిధర్ కోరారు. పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని,శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు పేరెంట్ టీచర్ మీటింగ్ గురించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు బి.మాల్యాద్రి, టి.శ్రీనివాసులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ పద్మావతి, సిఆర్పిలు, మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top