మహబూబాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 23 ఏప్రిల్ 2025. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా కు చెందిన మార్గం శ్రీనివాస్ ఉమారాణి ప్రథమ పుత్రిక హైదరాబాద్ డి ఆర్ జూనియర్ కాలేజ్ ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలతో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మార్గం హరిప్రియ 468/470 (ఎం.పి.సి) ఉత్తమ ఫలితాము సాధించిన సందర్భంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసిన జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా,తెలంగాణ సైజ్ కాంట్రాక్టర్స్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మెతుకు ఉప్పలయ్య , విజయలక్ష్మి సాయికిరణ్, కట్ట సౌమ్య సాయిచరణ్ మరియు పలువురు అభినందనలు తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


