TRINETHRAM NEWS

బీజేపీ శాసనసభాపక్షనేతగా మహేశ్వర్‌రెడ్డి?

తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది.

ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డిలు శాసనసభాపక్ష నేత రేసులో ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.

మెజారిటీ సభ్యులు మహేశ్వర్‌రెడ్డి వైపు మొగ్గుచూపుతున్నారని సమాచారం. దీనిపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది.