WhatsApp Image 2024 01 08 at 6.19.58 PM
6 గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ : పొంగులేటి
అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
ప్రస్తుతం డేటా ఎంట్రీ జరుగుతోందని చెప్పారు.
ఆరు పథకాల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కమిటీ ఛైర్మన్గా ఉపముఖ్యమంత్రి భట్టి వ్యవహరించనున్నట్లు తెలిపారు.
హామీలను 40 రోజుల్లో నెరవేరుస్తామని తామెక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.
