Lawyers hold Protest Rally : న్యాయవాదులపై దాడిని నివసిస్తూ ఖనిలో న్యాయవాదుల ధర్నా ర్యాలీ

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనికి చెందిన న్యాయవాది గుళ్ళ రమేష్ పై కొంతమంది దాడి చేయటాన్నీ నిరసిస్తూ సోమవారం ఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు .. అనంతరం న్యాయవాదులు కోర్టు నుంచి ఖని ప్రధాన చౌరస్తా వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ నిత్యం న్యాయం కోసం పరితపించే న్యాయవాదులపై పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో బీరు సీసాలతో దాడి చేయడం దారుణమన్నారు రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని దాడులకు పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ సంయుక్త కార్యదర్శి ముచకుర్తి కుమార్ క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి ఎరుకల ప్రదీప్ కుమార్ ఉపాధ్యక్షులు దేశెట్టి అంజయ్య సీనియర్ కార్యవర్గ సభ్యులు పంగ శంకర్ కార్యవర్గ సభ్యులు పులిపాక రాజ్ కుమార్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు బల్మూరి అమరేందర్ రావ్ మేడ చక్రపాణి చందాల శైలజ పెట్టం శ్రీనివాస్ గోశిక ప్రకాష్ కోసన శ్రీనివాస్ వేల్పుల అరుణ్ కుమార్ యాదవ్ అవినాష్ వెంకటేష్ సుజాత రేష్మ తిలక్ తదితరులు న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lawyers hold protest rally

You cannot copy content of this page

Scroll to Top