కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

TRINETHRAM NEWS

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ
బెంగుళూరు:- కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగుళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసనల సమయంలో ఈ ప్రమాదం చోటుచేకుంది. ప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ త్రిలోక్ పూర్తిగా కోలుకోలేదు. అసుపత్రిలో చికిత్స అనంతరం బెంగుళూరులో ఉంటున్న త్రిలోక్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్రిలోక్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top