Koredla Vijaya Gowri : కోరెడ్ల విజయ గౌరీ గెలవాలి చట్ట సభల్లో ప్రజావాణి వినబడలి (ఎమ్మెల్సీ ఐవి)

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ రిపోర్టర్ ఫిబ్రవరి 18 : ఉత్తరాంధ్ర శాసనమండలి టీచర్ ఎమ్మెల్సీ గా కోరెడ్ల విజయ గౌరీ ని ఉత్తరాంధ్ర శాసనమండలి అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలన్నారు అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ తో కలసి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఐటీడీఏ పరిధిలో గల పాఠశాలలు కళాశాలల్లో ఉపాధ్యాయులు అధ్యాపకులతో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల హక్కుల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని ఉద్యమాలకు అండగా ఉంటారని పాలకవర్గాలకు ప్రతిపక్ష పార్టీ సభ్యులకు ఎన్నుకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటాయని పోరాటాల ద్వారానే అన్ని రకాల ప్రయోజనాలను సాధించుకోగలమని అందుకే పిడిఎఫ్ బలపరుస్తున్నటువంటి కోరెడ్ల విజయ గౌరిని గెలిపించాలని లగ్షా పల్లి కేజీబీవీ ఆశ్రమ ఉన్నత పాఠశాల కృష్ణాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాడేరు జూనియర్ కళాశాల పాడేరు మరియు ఆశ్రమ ఉన్నత పాఠశాల తరసింగ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుకుంపేట అరకువేలి మండలంలోని ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ మరియు హై స్కూల్ సందర్శించి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్, ఎమ్మెల్సీ ఐవి తో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Koredla Vijaya Gowri

You cannot copy content of this page

Scroll to Top