TTD : టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు అన్నమయ్య భవనంలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానాలు వివరించిన ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు.
రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.
రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయం.
ఇతరదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం.
త్వరలో వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పులు.
శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ ఏర్పాటు.
సైన్స్‌ సిటీకి కేటాయించిన 20ఎకరాలు తిరిగి స్వాధీనం.
తిరుమలలో అనధికార హాకర్లపై చర్యలకు నిర్ణయం.
ఆగమ సలహా మండలిపై టీటీడీ వేటు.
రూ.26 కోట్లతో 1,500 గదులకు మరమ్మతులు.
ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు.
జూ పార్క్ నుంచి కపిలతీర్థం వరకు ప్రైవేటు నిర్మాణాలు లేకండా తీర్మానం.
తితిదేలోని శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం టికెట్లు ఇచ్చి స్వామివారి దర్శనం కేటాయింపు.
తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలు ఖాళీ చేయిస్తాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Key decisions in TTD

You cannot copy content of this page

Scroll to Top