KCR Srirama Raksha : తెలంగాణ కు కెసిఆర్ శ్రీరామ రక్ష

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మర్పల్లి మండలం దామస్తపూర్ గ్రామం నుండి మాజీ సర్పంచ్ లు యాదవ రెడ్డి మరియు శాంత కుమార్, మాజీ ఉపసర్పంచ్ పరశురాం నాయక్, వార్డు మెంబర్లు పరుశురాం, మోహన్ రెడ్డి అంజయ్య, రవి నాయక్, గోవర్ధన్., పిఏసిఎస్ మాజీ డైరెక్టర్ *బాబు రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ సంగయ్య, మాజీ రైతుబంధు సభ్యులు గోవర్ధన్ రెడ్డి, నాయకులు జితేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, భుజంగ రెడ్డి, లక్యానాయక్, మోతిరామ్, బాష్యా నాయక్, సునీల్ నాయక్, రాజ్ కుమార్, కుదుస్, సల్లావుద్దీన్ లతో పాటు మరో 100 మంది బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీని వీడి వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
డాక్టర్ మెతుకు ఆనంద్ వారికి గులాబీ కండువా కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. క్షేత్రస్థాయిలో కెసిఆర్ చేసిన అభివృద్ధి మరియు సంక్షేమం అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల చేస్తున్న నిర్లక్ష్యం వల్ల మళ్ళీ కెసిఆర్ రావాలని కోరుకుంటూ బి ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KCR Srirama Raksha for Telangana

You cannot copy content of this page

Scroll to Top