WhatsApp Image 2024 03 30 at 16.11.08
Trinethram News : పార్టీ మారుదామా వద్దా అని కార్యకర్తలను అడిగిన కడియం. బీఆర్ఎస్ పార్టీలోనే వుంటే కార్యకర్తలకు, నియోజకవర్గ అభివృద్ధి చేసుకోలేమని కడియంకు చెప్పిన కార్యకర్తలు.
నేను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి భయం ఎందుకు. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం నా విషయంలో బిఆర్ఎస్ అభ్యంతరం ఎందుకు అన్న కడియం.
కాంగ్రెస్ నేతలే నా వద్దకు వచ్చి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నా కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఉద్యమ కారులకు కేసీఆర్ చేసింది ఏం లేదన్న కార్యకర్తలు. ఒక్కరోజు కేసీఆర్ కేటీఆర్ ఉద్యమకాలను దగ్గరికి రానివ్వలేదు.
