దేవరకొండ డివిజన్ డిసెంబర్ 15 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయంలో జరిగిన శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమానికి 15 క్వింటాల బియ్యం విరాళాన్ని జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు పి ఎ సీఎస్ చైర్మన్ అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి ని శాలువాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నరసింహారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఆ అయ్యప్పస్వామి ఆశీస్సులు ఉండి సకాలంలో వర్షాలు కురిసి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


