విచక్షణ మరచి బలహీన వర్గాల పై దాడులు

TRINETHRAM NEWS

విచక్షణ మరచి బలహీన వర్గాల పై దాడులు

త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లాఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలం, పుల్లలచెరువు మండలం చెన్నంపల్లె గ్రామంలో ఈ మధ్య కాలంలో చాకలి కులానికి చెందిన మతిస్థిమితం లేని అమాయకురాలైన అదే గ్రామానికి చెందిన రెడ్డి వర్గం దాడి చేసి భయభ్రాంతుల గురి చేసిన సంఘటన అందరికీ తెలిసిందే..

ఇప్పుడు ఆ సంఘటన మరువకముందే అదే మండలంలోని మానేపల్లి గ్రామంలో ఎస్సి కులానికి చెందిన కొండ అశోక్ మీద నిన్న రాత్రి అదే గ్రామంలోని రెడ్డి వర్గం విచక్షణ మరిచి మరి దాడి చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది..దాదాపు 15 మంది కలిసి ఆ వ్యక్తిపై దాడి చేసి గాయాలు చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు…ఈ దాడి తో బాధ్యుడి ముక్కు మీద నాలుగు కుట్లు తల వెనుక భాగంలో ఆరు కుట్లు పడ్డాయి… అర్ధరాత్రి వేళ ఎస్సీ పాలెం మీదకు వచ్చి రెడ్లు దాడి చేసి మరి కులం పేరుతో దూషిస్తున్నారని పాలెం వాసులు వాపోతున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top