వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బషీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో, ఎంపీవో, మిషన్ భగీరథ ఇంజనీర్లు మరియు పంచాయతీ కార్యదర్శులతో గ్రామాలలో వేసవి కాలం సంధర్బంగా తాగునీటి సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా, సజావుగా నీటి సరఫరా జరిగేలా చూడాలి.పైపు లైన్ లీకేజి, బోర్ల మరమ్మతులు ఉంటే వెంటనే పనులు పూర్తి చేయాలి.కార్యదర్శులు వేసవి కాలంలో ఎక్కువ సమయం గ్రామాల్లో ఉండాలి లాగ్ బుక్ లో ఇష్టం వచ్చినట్లు సంతకాలు చేయవద్దు.త్రాగునీటి సమస్య ఉంటే ఏఈ లకు చెప్పండి.గ్రామాలలో జరిగే అభివృద్ధి, సంక్షేమంపై మీకు అవగాహన ఉండాలిMGNREGS పనులు త్వరగా చేయించండి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


