WhatsApp Image 2024 04 09 at 15.35.51
Trinethram News : పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. నూతన గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. అక్కడే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు..
అనంతరం పురోహితుల ఆశీర్వాదం స్వీకరించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్.. క్రోధి నామ సంవత్సరంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజల కోరిక మేరకే పిఠాపురంలో పోటీకి దిగానన్న ఆయన.. కూటమి విజయయాత్ర పిఠాపురం నుంచే మొదలవుతుందని అన్నారు.
