Pakistan Warns India : మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం

TRINETHRAM NEWS

భారత్‌ను హెచ్చరించిన పాక్ సైనిక ప్రతినిధి

సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక

ఉగ్రవాది హఫీజ్ సయీద్ వ్యాఖ్యలను పునరుద్ఘాటించిన పాక్ సైనిక ప్రతినిధ

“మా నీళ్లు ఆపితే, మీ ఊపిరి ఆపుతాం” అంటూ వ్యాఖ్య

ఉగ్రవాదానికి మద్దతు ఆపే వరకు ఒప్పందం నిలిపివేత అని భారత్ స్పష్టం

Trinethram News : ఆక్రమిత కశ్మీర్‌ను ఖాళీ చేయడంపైనే చర్చలన్న భారత విదేశాంగ శాఖ రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవన్న ప్రధాని మోదీ

సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్‌కు పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ గతంలో ఉపయోగించిన పదజాలాన్నే ఆయన పునరుద్ఘాటించడం గమనార్హం. ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ, “మీరు మా నీటిని అడ్డుకుంటే, మేము మీ ఊపిరిని అడ్డుకుంటాం” అని చౌదరి భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం. 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కూడా గతంలో ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం, ఏప్రిల్ 23న భారత్ సింధు జలాల ఒప్పందంలోని కొన్ని భాగాలను నిలిపివేసింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం, సింధు నది మరియు దాని ఉపనదుల నీటి పంపకాలకు సంబంధించినది.

ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాగవని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలను ఖాళీ చేయడంపై మాత్రమే భవిష్యత్తులో చర్చలు ఉంటాయని ఆయన తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం విశ్వసనీయంగా, శాశ్వతంగా ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని జైస్వాల్ పునరుద్ఘాటించారు. “నీరు, రక్తం కలిసి ప్రవహించవు” అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.

అంతకుముందు, రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తే పాకిస్థాన్ “ప్రతి పైసా కోసం కష్టపడాల్సి వస్తుందని” హెచ్చరించారు. “భారతీయుల రక్తంతో ఆడుకోవడం ఇప్పుడు పాకిస్థాన్‌కు చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది” అని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

If you stop our water

You cannot copy content of this page

Scroll to Top