అలాగైతే ఎస్సీ కార్పొరేషన్ మూసేయడం మేలు: హైకోర్టు

TRINETHRAM NEWS

అలాగైతే ఎస్సీ కార్పొరేషన్ మూసేయడం మేలు: హైకోర్టు

అమరావతి:

ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని నిలదీసింది.

ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

స్వయం ఉపాధి కింద బడ్జెట్లో కేటాయించిన ₹7వేల కోట్లలో ఏమీ ఖర్చు చేయలేదా అని ప్రశ్నించింది.

ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరనప్పుడు దాన్ని మూసేయడం మంచిదని వ్యాఖ్యానించింది.

బిల్లుల చెల్లింపు వివరాలతో అఫిడవిట్ వేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది.

You cannot copy content of this page

Scroll to Top